Header Banner

అసెంబ్లీ సీట్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! స్త్రీలకు సమాన హక్కులు.. 1986లోనే ఎన్టీఆర్ ఘన నిర్ణయం!

  Wed Mar 12, 2025 21:39        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మహిళా సాధికారిత ప్రారంభం అయింది టీడీపీతోనే అని చెప్పుకొచ్చారు. 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారన్నారు. తమ హయాంలో మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు.. నిర్ణయాలను వివరించారు. తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉన్నా అంతమందికీ ఇస్తామని స్పష్టం చేసారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. నియోజవకర్గాల పునర్విభజన జరిగితే మహిళలకు దాదాపు 75 సీట్లు వస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఆ సీట్లు వారికే
ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత గురించి అసెంబ్లీ వేదికగా వివరించారు. తెలుగుదేశం పార్టీ సిద్దాంతం జండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించడమని తెలిపారు. ఎన్టీఆర్ 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారన్నారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నార ని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. ఇచ్చిన ఆస్తి విషయంలోనూ కోర్టుకు వెళ్లి వెనెక్కి ఇవ్వాలని అడిగారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2018 లో మహిళలకు పసుపు - కుంకుమ కింద ఒక్కో మహిళకు రూ 10 వేలు చొప్పున రూ 9,689 కోట్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేసారు.


ఇది కూడా చదవండినిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! 30 వేల మంది పైలట్లు అవసరం..


అమలు చేస్తాం
ప్రస్తుత హయాంలో దీపం -2 కింద మహిళలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతికి మద్దతుగా మహిళలు చేసిన ఉద్యమాన్ని చంద్రబాబు సభలో వివరించారు. 1995లో మహిళా ఎంపవర్‌మెంట్ కోసం ఆలోచిస్తూ డ్వాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్ చేయాలని నిర్ణయించామన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయా ల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని తెలిపారు. దీని వల్ల ఆడబిడ్డలు చదువుకున్నారని... వారు కూడా పనిచేయడం ప్రారంభించా రన్నారు. పుట్టిన అమ్మాయి భారం కాదు ఇంటికి మహలక్ష్మి గా భావించి వారి పేరు తో ఓ 5వేలు డిపాజిట్ చేయించామని తెలిపారు. స్పీకర్‌గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చామన్నారు.

ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!


మహిళలకే ప్రాధాన్యత
ఎనిమిది శాతంతో ప్రారంభమైన రాజకీయ రిజర్వేషన్లు స్ధానిక సంస్ధలలో 33 శాతం అయ్యింద రు. ఆడవాళ్లు మగవాళ్ళకంటే తెలివైన వారని.. ఈ విషయం చాట్ జీపీటీని అడిగినా చెపుతుందని వివరించారు. ఆర్టీసీలో ఆడ కండెక్టర్‌లు చాలా బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. 65 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఆడబిడ్డలకు ఇప్పించామన్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. పూర్తి రక్షణ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!

టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCM #CBN #todaynews #assembly #seats #flashnews #latestnews